14-06-2025 11:46:58 PM
డ్రైవర్ మృతి..
పటాన్ చెరు: టిప్పర్ వాహనానికి మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి డ్రైవర్ మృతి చెందగా టిప్పర్ పూర్తిగా దగ్దం అయ్యింది. ఈ ఘటన జిన్నారం మండలం(Jinnaram Mandal) ఖాజీపల్లి శివారులో తెల్లవారు జామున జరిగింది. సీఐ రవీందర్ రెడ్డి(CI Ravinder Reddy) తెలిపిన వివరాల మేరకు.. ఖాజీపల్లి గ్రామ శివారులోని బిల్వాని స్టోన్ క్రషర్ లో చెడిపోయిన టిప్పర్ కు డ్రైవర్ మరమ్మత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో టిప్పర్ ట్రాలీని హైడ్రాలిక్ ద్వారా పైకి లేపగా విద్యుత్ వైర్లు తగలడంతో డ్రైవర్ రామ్ సుజన్(38) కరెంటు షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ షాక్ తో టిప్పర్ కు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధం అయ్యింది. క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.