14-06-2025 11:49:43 PM
బీసీల పాలన తోటే అభివృద్ధి సాధ్యం
బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, మాజీ కలెక్టర్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు
బీసీలు రాజకీయాలు నేర్వాలి: మాజీ ఐపీఎస్ పూర్ణచందర్ రావు
చైతన్యంతో ముందుకు వెళ్లాలి: డాక్టర్ చెరుకు సుధాకర్
నల్గొండ జిల్లా బీసీ సదస్సులో ప్రముఖుల పిలుపు
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): భారతదేశంలోని మిగతా రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని బీసీలు రాజకీయ పార్టీలు స్థాపించి రాజ్యాధికారంలోకి రావాలని, రాజ్యాధికారమే నిజమైన ఆత్మగౌరవమని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్, మాజీ కలెక్టర్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు(Former Collector IAS Officer T Chiranjeevulu) పిలుపునిచ్చారు. శనివారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నల్గొండ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లో గల టీఎన్జీవో భవన్ లో శ్రీకాంతాచారి ప్రాంగణంలో 'విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు' అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీహార్ లో బీసీలైన యాదవులు కురుమలు రాజకీయ పార్టీలు స్థాపించి, తమిళనాడులో డీఎంకే ,ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది పార్టీ ద్వారా బీసీలు స్థాపించి రాజ్యాధికారం సాధించారని ఆయన చెప్పారు తమిళనాడులో బీసీలు పరిపాలిస్తుండడం వల్లనే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తలసరి ఆదాయం అందరికీ సమానంగా పెరిగిందని తెలిపారు. బీహార్లు జనతదళ్ ఆర్జెడీలు సుదీర్ఘంగా పరిపాలిస్తూ బీసీల ఆత్మగౌరవ బహుట ఎగురవేస్తున్నారని చెప్పారు. ఒక్క తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో తప్ప బీసీలు అన్నిచోట్ల అధికారంలో కొనసాగాలని ఆయన విపులంగా వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం నక్సల్ బరి పోరాటం తెలంగాణ ఉద్యమం జల్ జంగల్ జమీన్ పేరిట జరిగిన ఆదివాస ఉద్యమాలు జరిగాయని ఇకముందు బీసీ ఉద్యమం ఒక్కటే జరగాల్సి ఉందని ఆయన హితువు చెప్పారు. వెస్ట్ బెంగాల్లో బ్రాహ్మణుల పరిపాలన వల్ల ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు అభివృద్ధి సాధించలేదని గుర్తు చేశారు. బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలో మనకు సమానత్వం సంప్రదాత్రత్వం పరిచయం చేసినప్పటికీ ఆత్మగౌరవం కోసం స్వపరిపాలన కోరుకున్నామని సందర్భంగా గుర్తు చేశారు. అగ్రకులాలు చేసే ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ బీసీల ఆత్మ అభిమాన ఉద్యమంలో వెనుకబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్కువ జనాభా ఉన్న రెడ్లు వెలుమలు కమ్మల నుంచి అధిక శాతం ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని అధిక జనాభా ఉన్న బీసీల నుంచి తక్కువ శాతం ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని లెక్కలతో సహా వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు పోవాలని లేని పక్షంలో ఎన్నికల్లో యావత్ తెలంగాణ బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని చెప్పారు. ప్రజా ఉద్యమం ముందు ఎంతటి కఠినమైన సర్కార్ అయినా మెడలు వంచాల్సిందేనని తెలంగాణలో బీసీలు పోరాటం చేసి కుల గణన సాధించుకున్నారని అదే విధంగా 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరించారు.
మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీలు రాజకీయ పరిజ్ఞానం పెంచుకొని రాజకీయ పార్టీల ద్వారా రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు పెరియార్ తరహాలు బిసి పోరాటాలు చేస్తామని చెప్పారు. బీసీలు రాజ్యాధికార పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ బీసీలు ఉద్యమ చైతన్య తో దూసుకెళ్లాలని పోరాటాలు మరింత విస్తరింప చేయాలని సూచించారు. ప్రముఖ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ బీసీలు చైతన్యవంతం కావాలని బీసీలు చైతన్యవంతమవుతూ రాజకీయ పోరాటాలు విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటలెక్షన్స్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు పాలకూరి అశోక్ గౌడ్ చామకూర రాజు, కెవి గౌడ్, చెన్నా శ్రీకాంత్, కొండల్ గౌడ్, అవ్వరు వేణు, పరశురాం యాదవ్, సమీర్ కుమార్, నకరికంటి కాశయ్య, పందుల సైదులు, రామరాజు, రాఘవేంద్ర కళాశాల శంకర్ గౌడ్, మల్లయ్య ముదిరాజ్, తాండ కృష్ణ కౌండిన్య తదితరులు పాల్గొన్నారు.