03-05-2025 01:59:25 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(Nizamsagar SI Shivakumar) పట్టుకుని కేసు నమోదు చేశారు. మంజీరా నది నుండి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ TS12UB1605 ను శనివారం మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గేటు వద్ద పట్టుకొని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.