20-06-2025 08:04:16 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) అన్ని కంపార్టు మెంట్లు నిండి క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 70,226 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,960 మంది భక్తులు తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) శుక్రవారం ప్రకటించారు. తిరుమలలో శ్రీ సుందరరాజ స్వామి అవతార ఉత్సవాల ముగిశాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మహా అవతార ఉత్సవాలు గురువారం ముగిశాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.