20-06-2025 08:19:10 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) యూకే పర్యటిస్తున్నారు. ఇంగ్లండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో(Oxford University) ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో కేటీఆర్ పాల్గొననున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్లో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు (ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా) అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.