26-06-2025 01:07:33 AM
ఉద్యోగుల సమస్యలపై ఆరా
హైదరాబాబద్ సిటీ బ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగుల సమస్యల పరిష్కార వారోత్సవాల్లో భాగం గా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్కుమార్, కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసో సియేట్ అధ్యక్షుడు కె.ఆర్. రాజ్ కుమార్లతో పాటు సభ్యులు ఖలేద్ అహ్మద్, ముఖీ మ్ ఖురేషి, ఎ.వి. శ్రీధర్ ప్రభుత్వ సిటీ కళాశాలలో అక్కడ ఉద్యోగులతో సమావేశమ య్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వెళ్లి, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ దంత వైద్య కళాశాల, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి యూనిట్లలో ఉద్యోగులతో సమావేశా లు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని(ముజీబ్) చొరవతో సీఎం రేవంత్రెడ్డికి సమర్పించిన 58 సమస్యలు, వాటి పరిష్కారానికి జరుగుతున్న కృషి గురించి ఉద్యోగు లకు వివరించారు. ఈ కార్యక్రమంలో రహీం, రాజు, రాజ్ కుమార్, రామ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్, రాజు, కళ్యాణ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.