26-06-2025 01:07:39 AM
బీజేపీ నాయకుల డిమాండ్
కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం, బిచ్కుంద మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా రాస్తారోకో నిర్వహించాలని భావించారు.
జుక్కల్ నియోజకవర్గ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుంద మండలంలో మధ్యంతరంగా నిలిపివేసిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని బిచ్కుంద మండల బిజెపి అధ్యక్షులు శెట్పలి విష్ణు డిమాండ్ చేశారు. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం బస్టాండ్ చౌరస్తాలో రాస్తారో కో నిర్వహించారు.
ప్రతి మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని బిజెపి నాయకులు హెచ్చరించడంతో బిచ్కుందలో చాలా రోజుల నుండి నిలిపివేసిన సెంట్రల్ లైటింగ్ పనులను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పనులను స్టార్ట్ చేశారన్నారు.
బిజెపి ధర్నాకు రాస్తారోకకు భయపడి పనులను బిచ్కుందలో స్టార్ట్ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గంలో మద్నూర్, పిట్లం మండలాలలో సెంట్రల్ లైటింగ్ పనులను త్వరలో ప్రారంభించాలని కోరుతున్నాం. లేని యెడల భారతీయ జనతా పార్టీ అన్ని మండలాల్లో కూడా ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షు రాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార , కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ రాము సెట్, బిచ్కుంద జనరల్ సెక్రటరీలు జాదో పండరి, ముత్యం పిరాజీ, 8 మండలాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.