కరీంనగర్ రూరల్ తహశీల్దార్ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు
16-03-2026 08:44 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ తహశీల్దార్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గందె లక్ష్మీనరసింహారావును టీఎన్జీవో, టీజీవో సంఘాల నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, టీజీవో సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళి చరణ్, కార్యదర్శి డాక్టర్ అరవింద్ రెడ్డి, నాయకులు సుధాకర్, నమర్ సేన్, ముప్పిడి కిరణ్ కుమార్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, రాజేష్ భరద్వాజ్, రాజు నాయక్, రమేష్ గౌడ్, ఏవి రాజేశ్వరరావు, రాజమహేందర్, గోపాల్ రెడ్డి, వాస్తవిక్ గౌడ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.




