1 July, 2026 | 6:47 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి

16-03-2026 08:41 PM

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిల్లీ భాను ప్రసాద్

కందుకూరు,(విజయక్రాంతి): విద్యార్థుల 8,500 కోట్ల స్కాలర్షిప్&ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిల్లీ భాను ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కందుకూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని విద్యారంగానికి కనీసం 15% బడ్జెట్ కేటాయించాలని, విద్యారంగం సమస్యలపై వెంటనే రాష్ట్రం స్పందించాలన్నారు.

విద్యార్థుల సమస్యలపై ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాబోయే మార్చి 20న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి కనీసం 15 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర అభివృద్ధి విద్యపై ఆధారపడి ఉంటుందని, విద్యను బలోపేతం చేయకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా విద్యాశాఖకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి మంత్రి నియామకం జరగకపోవడం వల్ల విద్యారంగానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. అందువల్ల వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కందుకూరు నగర కార్యదర్శి గంగవరం వినయ్, స్పోర్ట్స్ కన్వీనర్ మణి, డిల్లీ జశ్వంత్ లు పాల్గొన్నారు.