calender_icon.png 1 June, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు చెల్లించేందుకు 18 వరకు గడువు

09-11-2024 12:10:58 AM

పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.

రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ.125, మూడు లేదా అంతకన్నా తక్కువ పేపర్లు రాసేవారు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసు ముతో డిసెంబర్ 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.