16-06-2025 01:35:50 AM
న్యూఢిల్లీ, జూన్ 15: పదహారేండ్ల తర్వాత నిర్వహించనున్న 2027 జనగణన నోటిఫికేషన్ నేడు వెలువ డనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంమంత్రి అమి త్ షా ఆదివారం న్యూఢిల్లీలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశానికి యూనియర్ హోం సెక్రటరీ, జనగణన కమిషనర్, సీనియర్ అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సారి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నారు. రెండు దశల్లో జనగణన పూర్తి చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ గణన కోసం ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా 34 లక్షల మంది ఎన్యూమరేటర్లను నియమించింది.