calender_icon.png 26 June, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే తొలి బోనం

26-06-2025 01:23:27 AM

- గోల్కొండ అమ్మవారికి నజర్ బోనం 

- గోల్కొండ కోటలో- ఘనంగా మెట్ల పూజ

- లంగర్ హౌస్‌లో తొలి బోనానికి హాజరుకానున్న మంత్రులు  

- ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ 

- అన్ని ఏర్పాట్లు పూర్తి: ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు

కార్వాన్, జూన్ 25: బోనాల పండుగకు అంతా సిద్ధమైంది. గురువారం ఉదయం నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. లంగర్‌హౌస్‌లో నిర్వహించే తొలి బోనానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మొదటి రోజు గురువారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి నజర్ బోనం సమర్పించనున్నారు.

లంగర్‌హౌస్‌లో నిర్వహించే కార్యక్ర మానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు తెలియజేశారు. 32 అడుగుల భారీ తొట్టెలను మం త్రులు సమర్పించనున్నారు. లంగర్‌హౌస్‌లోని ప్రతాప్ థియేటర్ సమీపంలో సభ వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ పట్టువస్రాల సమర్పణ అనంతరం తొట్టెలను భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు తీసుకెళ్లన్నారు. 

అమ్మవారికి తొమ్మిది బోనాలు  

గురువారం నిర్వహించే తొలి బోనం ప్ర తి ఆది, గురువారాల్లో కలిపి మొత్తం తొ మ్మిది బోనాలను అమ్మవారికి సమర్పించనున్నారు. గోల్కొండలో ప్రారంభమైన తర్వాత జంట నగరాల్లో బోనాల పండుగ మొదలవుతుంది. జూలై 24న అమ్మవారికి చివరి బోనం సమర్పించనున్నారు. చివరి రోజున అమ్మవారికి సమారోహణ కుంభా ర్తి, గావు కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు వృత్తి పనివారాలతో సమాప్తి కార్యక్ర మం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా టు చేశామని చైర్మన్ చంటి బాబు తెలిపారు. వాంఛ నీయ సంఘటనలో చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. 

బంగారు బోనం

గోల్కొండ కోటలోని మహంకాళి అమ్మవారికి రిసాల బజార్‌లో నివాసం ఉండే సాయిబాబా చారి కుటుంబం బంగారు బోనంతో పాటు అమ్మవారికి పుస్తెలతాడు సమర్పించనున్నారు. అనంతరం రిసాల బజార్ నుంచి భారీగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని వృత్తి పని వారల సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చారి తెలియజేశారు. 

ఘనంగా మెట్ల పూజ 

అమావాస్య సందర్భంగా గోల్కొండ కోటలోని మెట్టు మెట్టుకు బొట్టు కార్యక్రమాన్ని బుధవారం ఆలయ ఈవో వసంత, ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు, యువతులు గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయానికి చేరుకునే ప్రతి మెట్టుకు బొట్టు పెట్టారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. వందలాదిమంది మహిళలు తరలివచ్చారు.