20 June, 2026 | 3:41 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

నేడే మూడో విడత దోస్త్ సీట్ల కేటాయింపు

06-07-2024 01:32 AM

ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): నేడు మూడో విడత దోస్త్ సీట్లను కేటాయించనున్నారు. మొద టి, రెండో వితల్లో కలిపి మొత్తం ఇప్పటి వరకు 93,214 మంది విద్యార్థులు డిగ్రీలో సీట్లు పొందినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసినట్లు పేర్కొన్నారు. మూడో విడతకు మొత్తం 66,976 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 80,312 వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్‌కు సమానంగా ఉద్యోగ అవకాశాలు లభించే కోర్సులు డిగ్రీలోనూ ఉన్నట్లు ఆయన వివరించారు. ఫస్టియర్ విద్యార్థులకు ఈనెల 15 నుంచి లేదా నెలాఖరు నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు.