16 April, 2026 | 1:46 AM

నేటి ప్రజావాణి రద్దు

21-04-2025 12:00 AM

కరీంనగర్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం  నిర్వహించే ప్రజావాణి  కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. భూభారతి కొత్త ఆర్‌ఓఆర్ రెవిన్యూ చట్టం అమలు నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందున, అధికారులంతా ఆ సదస్సులకు హాజరు కావలసిన ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.