15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

22-04-2025 01:39 PM

కాటేదాన్ లో షెడ్లు కూల్చివేత

రాజేంద్రనగర్: టౌన్ ప్లానింగ్ అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి ఐదు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపడుతున్నారు. సర్వే నంబర్ 168 నుంచి 178లో వెలసిన అక్రమ షెడ్ లను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా కొందరు భారీ షెడ్లు నిర్మించారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, టౌన్ ప్లానింగ్ ఏసిపి శ్రీధర్ హెచ్చరించారు.