calender_icon.png 6 May, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిపిఏ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

05-05-2025 08:43:28 PM

మంచిర్యాల (విజయక్రాంతి): తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (Telangana Psychologists Association) 8వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విన్నర్స్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. సైకాలజిస్ట్ లు పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా టీపీఏ జిల్లా అధ్యక్షులు, సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ 2017లో డాక్టర్ మోతుకూరి రామచందర్ చే స్థాపించబడి తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది సంవత్సరాలుగా మానసిక రుగ్మతలను నిర్మూలించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.

అదే విధంగా నేటి సమాజంలోని పరిస్థితుల వలన చాలామంది వివిధ రకాల మానసిక రుగ్మతలతో బాధించబడుతున్నారని, వారందరినీ మానసికంగా దృఢపరిచే విధంగా పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల మానసిక ఎదుగుదలను పెంపొందించే విధంగా పాఠ్యాంశాలను చేర్చి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో సైకాలజిస్టులను నియమించాలని కోరారు. దీని ద్వారానే సమాజంలో ఒక నైతికతను పెంపొందించడంతో పాటు, విద్యార్థులు, యువత మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకొని మంచి పౌరులుగా నిర్మితమవుతారన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా గౌరవ సలహాదారులు కే టి ఎస్ స్కూల్ చైర్మన్ పద్మచరణ్, గుండేటి యోగేశ్వర్,  ప్రధాన కార్యదర్శి సుమన చైతన్య, వైస్ ప్రెసిడెంట్స్ మొగిలి, రజిత, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు తాళ్లపల్లి కవిత, విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.