calender_icon.png 13 June, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో సీఎం మార్పు... ప్రతిపక్షాల కల్పిత కుట్ర

17-05-2025 04:56:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. ఈనెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలోగా జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులందరూ కలిసే ఉన్నారని, కావాలనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యాలను ప్రతిపక్ష నాయకులు వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. వారిపై సైబర్ క్రైమ్ లో కేసు పెడతామని మహేశ్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అనేది ప్రతిపక్షల తప్పుడు ప్రచారమేనని విమర్శించారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకున్న విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఉనికి కోసం బీఆర్ఎస్ నేతలు ఆరాటపడుతున్నారని, బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య పోరు నడుస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనపడకుండా పోతుందని జోష్యం చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తో సాధించిందేమిటి.. కోల్పోయిందేమిటో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం కోరారు. మతం పేరిట రాజకీయాల్లో లబ్ది పొందడం బీజేపీకి పరిపాటిదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీ, 2026లో డీలిమిటేషన్ దృష్ట్యా.. పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు డీలిమిటేషన్ కమిటీ వేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.