14-06-2025 12:14:59 AM
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పొదేం వీరయ్య
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన నేతలకు భద్రాద్రిలో ఘన సన్మానం
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలంలోని జిల్లా అధ్యక్షుల క్యాంపు కార్యాలయంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఇటీవల ఏఐసిసి ద్వారా నియమితులైన నల్లపు దుర్గాప్రసాద్, మోతుకురి ధర్మారావు, నాగ సీతారాములుగారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య స్వయంగా పాల్గొని, కార్యదర్శులను సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలలో నాయకులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.