12-12-2025 08:26:15 PM
- గుండెపోటుతో అక్క మృతి
- గంభీర్ పూర్ గ్రామంలో విషాదం
కోరుట్ల,(విజయకాంతి): పంచాయతీ ఎన్నికల్లో తమ్ముడి ఓటమి తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది స్థానికుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కృష్ణ మండల కేంద్రానికి చెందిన కొక్కుల మమత (38) ప్రస్తుతం కోరుట్లలో నివాసం ఉంటున్నారు. తన పుట్టినిల్లు జగిత్యాల జిల్లాలో కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో సోదరుడు పోతు రాజశేఖర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
తమ్ముడికి మద్దతుగా ఉండేందుకు మమత గ్రామానికి వచ్చారు అయితే గురువారం వెలువడిన ఫలితాల్లో తమ్ముడు రాజశేఖర్ ఓటమి చెందాడు తమ్ముడి ఓటమిని మమత కలత చెందారు ఈ క్రమంలో చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కోరుట్లలోనీ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించి న వైద్యులు మమత మృతి చెందినట్లు నిర్ధారించారు కాగా మమత భర్త ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్ళాడు మృతురాలికి బిడ్డ కొడుకు ఉన్నారు