calender_icon.png 18 June, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక

18-06-2025 12:12:02 AM

  1. రానున్న నాలుగేళ్లలో ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు

పేదవాడి కలను సాకారం చేస్తున్నాం

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందిస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

వాజేడు/వెంకటపురం,జూన్17(విజయక్రాంతి):పారదర్శకంగా,పార్టీలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు మంగళవారం వాజేడు రైతు వైదికలో వెంకటాపురం మార్కెట్ యార్డులో వేరు వేరుగా వాజేడు,వెంకటాపురం మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అందజేశారు.

ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభు త్వం 10సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. వాజేడు,వెంకటాపురం మండలాల్లో ఏ ఒక్కరి కీ ఇల్లు రాలేదని అన్నారు. పేదవాడి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.

ఈ మండలాల్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామంలో ఇండ్లు మంజూరు చేసి నిర్మాణం జరుగుతోందని తెలిపారు మొదటి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేయడం జరుగుతుందని,రా నున్న నాలుగేళ్లలో ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉందని,ఇందుకు ప్రభుత్వం,అధికారుల కృషి ఎంతగానో ఉందని తెలిపారు. సోషల్ మీడియా లో కొంతమంది ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని అన్నారు.