calender_icon.png 18 June, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యలను వెంటనే పరిష్కరించండి

18-06-2025 12:12:19 AM

కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూములు అత్యంత కీలకమైన అంశమని, ధరణి చట్టం ద్వారా ఉత్పన్నమైన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, నిజామాబాద్ కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంతు మంగళవారం సచివాలయంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

వచ్చే రెండు నెలలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమైనవని, భూ సమస్యల పరిష్కారానికి గడువుగా నిర్ణయించిన ఆగస్టు 15నాటికి న్యాయబద్ధమైన అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని..ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని మంత్రి సూచించారు.