02-11-2025 12:36:01 AM
9 నుంచి 16 వరకు జన జాతీయ గౌరవ్ దివస్
బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి): భగవాన్ బీర్సా ముండా గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని, బ్రిటీష్ వలసవాదంపై తిరుగుబాటు చేసి, గిరిజన సమాజానికి ఆరాధ్యదైవంగా నిలిచారని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్ రాంచందర్రావు అన్నా రు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో శనివారం జరిగిన వర్క్షాప్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నవంబర్ 9 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ వారోత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.