30 May, 2026 | 7:14 PM

Breaking News

ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే   •   వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని   •   అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది   •   మహిళా శక్తి సూపర్ మార్కెట్లు ఏర్పాట్లు చేస్తాం   •   మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి   •   విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో   •   వరి కొయ్యలకు నిప్పు పర్యావరణానికి ముప్పు   •   బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: కలెక్టర్ అంకిత్   •   కార్మికుల అసంఘటిత రంగాల కార్మికులకు సిఐటియు అండదండ   •   డంపు యార్డును తనిఖీ చేసిన కమీషనర్ ప్రఫుల్ దేశాయ్   •  

అమృత్ నిధుల కింద 573 కోట్లు విడుదల

02-11-2025 12:38 AM

నగర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగం

ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి) : అమృత్ 2.0 ప్రాజెక్టు నిధులకు సంబంధించి 573 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శనివారం పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధుల విడుదలలో ఎలాంటి త్రైమాసిక పరిమితులూ లేకుండా ట్రెజరరీ కంట్రోల్, క్వార్టర్లీ రెగ్యులేషన్ ఆర్డర్స్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నిధులను  నగర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇందులో ముఖ్యంగా నీటి సరఫరా, మురు గు నీటి వ్యవస్థ  మెరుగుదల, గ్రీన్ స్పేస్‌లు, పార్కులు, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాల కల్పన, వరదల నిర్వహణను చేపట్ట నున్నారు. ఈ నిధులకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ సెక్రట రీని ఆదేశించారు.