13 April, 2026 | 4:20 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

అమృత్ నిధుల కింద 573 కోట్లు విడుదల

02-11-2025 12:38 AM

నగర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగం

ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాం తి) : అమృత్ 2.0 ప్రాజెక్టు నిధులకు సంబంధించి 573 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శనివారం పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధుల విడుదలలో ఎలాంటి త్రైమాసిక పరిమితులూ లేకుండా ట్రెజరరీ కంట్రోల్, క్వార్టర్లీ రెగ్యులేషన్ ఆర్డర్స్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నిధులను  నగర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇందులో ముఖ్యంగా నీటి సరఫరా, మురు గు నీటి వ్యవస్థ  మెరుగుదల, గ్రీన్ స్పేస్‌లు, పార్కులు, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాల కల్పన, వరదల నిర్వహణను చేపట్ట నున్నారు. ఈ నిధులకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ సెక్రట రీని ఆదేశించారు.