calender_icon.png 5 June, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

45 రోజుల్లోనే తారాస్థాయికి చేరుకున్న గిరిజన మ్యూజియం సందర్శకులు

03-06-2025 07:16:33 PM

ఐటీడీఏ పీవో రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 వసంతాలు దాటి 12 వసంతాలలోకి అడుగుపెట్టి తెలంగాణ వేడుకలు ఏ విధముగా జరుపుకున్నామో గిరిజన మ్యూజియం ప్రారంభించి 45 రోజులలో సందర్శకుల తాకిడిని చూసి విజయోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బంది ఏర్పాటుచేసిన మ్యూజియం విజయోత్సవ సభ కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మ్యూజియం ప్రారంభించి 45 రోజులు అయిందని ,ప్రజల ఆదరణ చూసి మ్యూజియంను కొత్త హంగులతో చూపారులకు ప్రతిబింబించేలా మ్యూజియం పరిధిని పెంచి పర్యాటకులకు ఆహ్లాదం అనుభూతి కలిగేలా తయారు చేయడానికి ప్రణాళికల రూపొందిస్తామన్నారు. మ్యూజియం అభివృద్ధి చేయడానికి నా ఒక్కడి కృషి మాత్రం కాదని అందరి సలహాలు సూచనలు తీసుకొని మ్యూజియంలోని కళాఖండాలు, మట్టి ఇల్లులు, బోటింగ్ పాయింట్, బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇంకా కొత్త హంగులతో మ్యూజియంను రూపొందించి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మన మ్యూజియమును ఉదయం నుంచి సందర్శించేలా చేసి వారం పది రోజుల్లో అద్భుతమైన టూరిజం స్పాట్గా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇతర దేశాలలో ఉన్న అనగా బీహార్ మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఉన్న మ్యూజియంలు ఏ విధంగా పేరు గడించాయో ఆ స్థాయికి ఐటిడిఏ గిరిజన మ్యూజియమును తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తున్నానని అన్నారు.

ఐటీడీఏ మ్యూజియం ఇంత అందంగా రూపొందించడానికి ఐ టి సి, నవభారత్ సంస్థ వారు సోలార్ ప్యానల్, సీసీ కెమెరాలు, క్రీడా పరికరాలు గ్రామపంచాయతీ తరుపున సిబ్బంది, ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ ప్రాంగణంలో అందమైన గిరిజన మ్యూజియం ఏర్పాటు కావడానికి కృషి చేశారని, త్వరలో గిరిజన కల్చర్ కు సంబంధించిన చరిత్ర, కోయ భాష పైన అధ్యయనం చేసి తప్పనిసరిగా డిస్ప్లే బోర్డులు ప్రదర్శిస్తామని, రాబోయే ఆరు నెలల్లో తప్పనిసరిగా ఈ మ్యూజియం పేరు ఖండాంతరాలకు తెలిసే విధంగా చర్యలు చేపడుతామని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన కళా ప్రదర్శనలు తిలకించారు. 

మ్యూజియం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన అధికారులకు, సిబ్బందికి అభినందిస్తూ మెమొంటోలు అందించారు. ట్రైబల్ మ్యూజియం నిర్మాణానికి కృషిచేసిన పిఓకు యూనిట్ అధికారులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఏవో సున్నం రాంబాబు, ఎస్ ఓ భాస్కరన్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, రిటైర్డ్ ఈ ఈ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఏపీవో పవర్ వేణు, డీఎస్ఓ ప్రభాకర్ రావు, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, డి ఈ హరీష్, టీఎ శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం ఇన్చార్జి వీరాస్వామి, ఐటీడీఎ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.