03-06-2025 07:18:41 PM
ఆర్డీవో సూర్యనారాయణ..
కోదాడ: భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఆర్డిఓ సూర్యనారాయణ(RDO Suryanarayana) అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమం పరిశీలించి మాట్లాడారు. భూభారతి చట్టంలో ప్రభుత్వం అనేక వెసులుబాటు కల్పించిందన్నారు. భూమి సమస్యలు ఆర్డిఓ తాసిల్దార్ సమక్షంలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. దరఖాస్తు రూపంలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వాజిద్ అలీ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు సీతారాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ హిమబిందు సుమన్ రెడ్డి, నారపురెడ్డి, కిరణ్, బండి కోటయ్య పాల్గొన్నారు.