calender_icon.png 2 June, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన సబ్ ప్లాన్ తూచా తప్పక అమలు

01-06-2025 12:28:55 AM

  1. ఈసారి రూ.17,169 కోట్లు కేటాయించాం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

గిరిజన సంక్షేమానికి పెద్దపీట: మంత్రి పొంగులేటి

కిన్నెరసానిలో ఆదివాసీ కార్యకర్తల శిక్షణ ముగింపు

కార్యకర్తలతో మమేకమైన మీనాక్షి నటరాజన్ 

భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (విజయక్రాంతి): గిరిజన సబ్ ప్లాన్‌ను తూచా తప్పకుండా అమలు చేస్తామని, గిరిజన సబ్ ప్లాన్ కింద ఈ ఏడాది రూ.17,169 కోట్లు నిధులు కేటాయించామని, గతంలో ఖర్చు చేయని రూ.1,296 కోట్లను క్యారీ ఫార్వర్డ్ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.

శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజనుల అవసరాలు తెలుసుకొని ఆ వర్గాల నాయకులను ఒకచోట చేర్చి ఏఐసీసీ ద్వారా అమలు చేసేందుకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించామని అన్నారు.

అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు ఇందిరా సౌర గిరిజన వికాసం తెచ్చామని, 6.70 లక్షల ఎకరాలను రూ.12,500 కోట్లు ఖర్చు చేసి సాగులోకి తెచ్మాని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహా యం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ట్రైబల్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య, ఉమ్మడి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు జారీ ఆదినారాయణ, జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు.

అంతకుముందు కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల ఆవరణలో నేతలందరూ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కార్యకర్తలతో మమేకమై శిక్షణ కార్యక్రమంలో వారికి తగిన సలహాలు సూచనలు, దిశా నిర్దేశం చేశారు.

పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పార్టీలో నాయకత్వ లక్షణాలు ప్రజలతో సత్సంబంధాలపై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు

బీఆర్‌ఎస్ ఇక భూస్థాపితం: పీసీసీ చీఫ్ మహేశ్

రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భూస్థాపితం అవడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ జోష్యం చెప్పారు. ఆస్తులపై ఉన్న మమకారం ప్రజాసేవపై వారికి లేదని, ప్రస్తుతం వారి పార్టీలో ఆస్తుల పంచాయితీ కొనసాగుతోందన్నారు. వచ్చే ఎన్నికల కల్లా రాజకీయ ముఖచిత్రంలో ఆ పార్టీ కనుమరుగైపోతుందన్నారు.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 90 పైచిలుకు సీట్లతో అధికారం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తాం: మంత్రి పొంగులేటి

గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో సుమారు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను గిరిజనులకు పంపిణీ చేశారని, ఆ భూములను బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నాయకులు పక్కదోవ పట్టించారని అన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విధానాలతో స్కీంలను ప్రవేశపెడుతుందని తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా సింగరేణిని విస్తరిస్తాం 

ప్రపంచవ్యాప్తంగా సింగరేణిని విస్తరిస్తామని, విస్తరణకు అవసరమైన స మాచారం, సూచనలను కోసం కమిటీని నియమించామని, నివేదికలు రా గానే కార్యాచరణ చేపడతామని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం కొత్తగూడెంలోని సింగరేణి జన రల్ మేనేజర్ కార్యాలయం వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. అనం తరం మీడియాతో మాట్లాడుతూ..

100 సంవత్సరాల పైబడి అనుభవం ఉన్న సింగరేణి లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో ఉన్నామన్నారు. రాబోయే 30 సంవత్సరాల కాలం పాటు 22 మిలియన్ ట న్నుల బొగ్గును వెలికి తీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.  సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి ప్రమాద బీమాతో పాటు, కారుణ్య నియామకం చేపడతామని భరోసా ఇచ్చారు.