19 March, 2026 | 1:13 PM

Breaking News

మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం, డిప్యూటీ సీఎం ఉగాది శుభాకాంక్ష‌లు   •  

ఫారెస్ట్ ట్రెంచ్ పనులను అడ్డగించిన గిరిజనులు

18-06-2025 12:00 AM

మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సెక్షన్ సౌత్ బీట్ లో 1149 కంపార్ట్మెంట్ ఫారెస్ట్ భూమి లో అటవీశాఖ అధికారులు భూమి ఆక్రమించకుం డా జెసిబి తో ఫ్రెంచ్ పనులు నిర్వహిస్తుండగా ఆ భూమి మాదే నంటూ గిరిజనులు అడ్డుకున్నారు. ట్రెంచ్ పనులు నిర్వహిస్తున్న జెసిబికి అడ్డుగా కొందరు గిరిజన మహిళ రైతులు అడ్డుపడడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఏండ్ల తరబడిగా తాము ఆ భూమిని సాగు చేసు కుంటున్నామని, తమకు ప్రభుత్వం నుండి హక్కు పత్రాలు కూడా వచ్చాయని, ఇప్పుడు అటవీశాఖ అధికారులు, డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా వచ్చి ఖండాలు తీయడం సరికాదంటూ గిరిజనులు అడ్డుకున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకొని మా పొట్ట కొట్టకండి అని వేడుకున్నారు.

అవసరమైతే మా ప్రాణాలను వదులుకుంటామని, కందకం తీయ కుండా అడ్డుకుంటామని భీష్మించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింప చేశారు.

కేసముద్రం ఎస్ ఐ మురళీధర్ మాట్లాడుతూ వివాదాస్పద భూమికి సంబంధించిన ఆధారాలు, అవసరమైన పత్రాలు తీసుకువచ్చి సమర్పించాలని, ఆ తర్వాత రెవెన్యూ శాఖ సర్వే ఆధారంగా భూమి ఎవరిది అనేది నిర్ణయించడం జరుగుతుందని అప్పటివరకు, గొడవకు దిగవద్దని సూచించడంతో తాత్కాలికంగా గొడవ నిలిచిపోయింది.