calender_icon.png 18 June, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమలు పరిసర గ్రామాల అభివృద్ధికి సహకరించాలి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

18-06-2025 12:00:00 AM

మఠంపల్లి జూన్ 17: మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేళ్లచెరువు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మఠంపల్లి మండలంలోని మఠంపల్లి,చౌటపల్లి గ్రామాల అభివృద్ధి కి సంబంధించిన చెక్కులను రాష్ట్ర పౌరసరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,సంస్థ జనరల్ మేనేజర్ మునగాల రామ్మోహన్ రావు సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులకు హైదరాబాద్ లో తన నివాసం లో అందజేశారు.

చౌటపల్లి గ్రామ అభివృద్ధికి 10 లక్షలు రూపాయలు, ప్రాథమిక పాఠశాల విద్యా వాలంటీర్ల వేతనం కోసం 1,20, 000 రూపాయలు, చౌటపల్లిలో నిర్మించిన రామాలయం అభివృద్ధి కోసం 5లక్షలు రూపాయలు,మఠంపల్లి గ్రామ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు, గ్రామంలో ఇటీవల నిర్మించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 6 లక్షల రూపాయలు, శుభవార్త దేవాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఒక లక్ష రూపాయలు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ పరిశ్రమలు పరిసర గ్రామ ప్రజల పరస్పర సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు, అలాగే మై హోమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేపడుతున్నటువంటి సిఎస్‌ఆర్ కార్యక్రమములను ఆయన అభినందించి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమములు చేపట్టి పరిసర గ్రామల అభివృద్ధి తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, విజయ లక్ష్మి, మాజీ సర్పంచ్ ఆదూరి కిషోర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సింగారపు సైదులుపాల్గొన్నారు.