నూతన హెడ్మాస్టర్ కు సన్మానం
06-03-2026 07:00 PM
భైంసా,(విజయక్రాంతి): ముధోల్ మండలం చించాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలను స్వీకరించిన రాజశేఖర్ చారిని ఎస్టీయుటీఎస్ జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్ శుక్రవారం సన్మానం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో శాలువాతో సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




