09-09-2025 01:03:16 AM
పరిహారం ఇవ్వాలని డిమాండ్
సనత్నగర్, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): మైత్రివనం స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ట్రిపుల్ఆర్ ప్రాజెక్ట్ బాధిత రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. తమ భూములకు తగిన పరిహారం అందకుండా అన్యాయానికి గురవు తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు.
రైతులు మాట్లాడుతూ ‘మన పారంపర్య భూములను ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నా, ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాసం ఇవ్వలేదు. సీఎం, మంత్రులు హామీలు ఇచ్చినా అమలు కాలేదు. మాకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు. హెచ్ఎండీఏ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు నినాదాలు చేస్తూ డిమాండ్లను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు.