calender_icon.png 21 February, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి

21-02-2026 02:06:58 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి) : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం  తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి  సేవలు అమోఘమ ని, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్ల  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే  లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దివ్యాంగులు సమాజంలో సమాన అవకాశాలతో ముందుకు సాగేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.  దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ 57 వ డివిజన్ కార్పొరేటర్ ఎం.ప్రవీణ్ కుమార్, నాయకులు టాంకర కృష్ణయ్య యాదవ్, మైత్రి యాదయ్య, లీడర్ రఘు, ఎం.రాఘవేందర్ , తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సేవా సంస్థ ప్రతినిధి ఎదిర ప్రమోద్ కుమార్ తో పాటు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.