23-01-2026 12:16:52 AM
వాషింగ్టన్, జనవరి 22 : గ్రీన్లాండ్ తమ దేశంలో విలీనం చేసుకునే విషయం లో తీవ్రంగా ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. గ్రీన్లాండ్ను తమకు అప్పగించాలంటూ యూరప్ మిత్రదేశాలను బెదిరిం చిన ఆయన, ఇప్పుడు తన నిర్ణయాన్ని మా ర్చుకున్నారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి నాటోతో ఒక ’భవిష్యత్ ఒప్పందానికి మార్గం’ సుగమమైందని, ఈ నేపథ్యంలో యూరప్ దేశాలపై విధించాలనుకున్న సుం కాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.
దావోస్లో అలా..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ... గ్రీన్లాండ్ ‘హక్కు, టైటిల్, యాజమాన్యం’ తమకు కావాలని, అయితే, దాని కోసం సైనిక బలగాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వల్లే యూర ప్ నిలబడిందని, దశాబ్దాలుగా తాము చేసిన సాయంతో పోలిస్తే గ్రీన్లాండ్ను అడగటం చాలా చిన్న విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ మాటలు నాటో కూటమి పునాదులను కదిలించేలా ఉండటంతో సర్వ త్రా ఆందోళన వ్యక్తమైంది.
ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా, చైనాల నుంచి ఎదు రవుతున్న ముప్పును ఎదుర్కోవాలంటే ప్ర పంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ తమ నియంత్రణలో ఉండటం అత్యవసరమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీన్లాండ్ను అప్పగించని పక్షంలో డెన్మార్క్తో పాటు మరో ఏడు మిత్రదేశాలపై వచ్చే నెల నుంచి 10 శాతం, జూన్ నాటికి 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
డెన్మార్క్ దీటుగా..
డెన్మార్క్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మొదటి నుంచి గట్టిగా నిలబడింది. అమెరికా భద్రతాపరమైన ఆందోళనలపై చర్చకు సిద్ధమే కానీ, గ్రీన్లాండ్ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ బెదిరింపులతో గ్రీన్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సం క్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, ఐదు రోజులకు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలను నిల్వ చేసుకోవాలని కోరింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనతో దుకాణాలకు పరుగులు తీశారు.
నాటోతో ఒప్పందంపై స్పష్టత వస్తేనే..
తాజా పరిణామాలతో ట్రంప్ టారీఫ్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలన్న ఆయన వ్యూహం మాత్రం మారలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటోతో కుదిరిన ఫ్రేమ్వర్క్ డీల్ స్వరూపంపై స్పష్టత వస్తేనే ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగినట్లు భావించాలని వారు అభిప్రాయపడుతున్నారు.