14 July, 2026 | 6:28 PM

Breaking News

తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •  

‘ మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్’!

23-01-2026 01:18 AM

పరిశీలిస్తున్నామన్న మంత్రి నారా లోకేశ్

అమరావతి, జనవరి 22: రాష్ట్రంలో సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించాలన్న అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబ డుల కోసం దావోస్‌లో ఉన్న మంత్రి లోకేశ్  సోషల్ మీడియా బ్యాన్ అంశంపై స్పందించారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం డిసెంబర్ నుంచి నిషేధం విధించింది.

పిల్లలు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అనర్థాలు తె చ్చుకుంటున్నారు. దీనిని గమనించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని బ్యాన్ చేసింది. రాష్ట్రం లో ఈ అంశాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.