9 April, 2026 | 8:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

‘ మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్’!

23-01-2026 01:18 AM

పరిశీలిస్తున్నామన్న మంత్రి నారా లోకేశ్

అమరావతి, జనవరి 22: రాష్ట్రంలో సోషల్ మీడియా బ్యాన్‌పై స్టడీ చేస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ విధించాలన్న అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఏపీలో పెట్టుబ డుల కోసం దావోస్‌లో ఉన్న మంత్రి లోకేశ్  సోషల్ మీడియా బ్యాన్ అంశంపై స్పందించారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం డిసెంబర్ నుంచి నిషేధం విధించింది.

పిల్లలు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అనర్థాలు తె చ్చుకుంటున్నారు. దీనిని గమనించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని బ్యాన్ చేసింది. రాష్ట్రం లో ఈ అంశాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.