27-06-2025 12:58:20 AM
భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానన్న అమెరికా అధ్యక్షుడు
ఆమ్స్టర్డామ్, జూన్ 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. భారత్-పాకిస్థాన్ మధ్య అ ణు యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. బుధవారం నెదర్లాండ్స్లోని హేగ్లో నాటో శిఖ రాగ్ర సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. వరుస ఫోన్ కాల్స్తో భారత్, పాక్ మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపానని పేర్కొన్నారు.
వాళ్లు ఒకరితో ఒకరు ఇలా పోరాడితే తాము ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోలేమని తేల్చి చెప్పానన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని.. పాక్ జనరల్ ఆకట్టుకునే వ్యక్తి అని తెలిపారు. అయితే తన ఫోన్ కాల్ సందర్భంగా ఇరువురు వాణి జ్య ఒప్పందమే కావాలని చెప్పినట్టు గుర్తుచేశారు. అలా ఒక అణు యుద్ధాన్ని తాను విజ యవంతంగా ఆపగలిగానని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడంలో, రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో దాడులు కొన్నాళ్లు ఆగడంలో తనదే ముఖ్య పాత్ర అని వెల్లడించారు. అయితే ఇటీవలే భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమి లేదని మోదీ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమ ని, ఇందులో మధ్యవర్తి ఎవరూ లేరని స్ప ష్టం చేశారు.
ఆ తర్వాత ట్రంప్ కూడా ఈ ఒప్పందంలో తన జోక్యమేమీ లేదని ఆ రెం డు దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో నాటో సదస్సు సందర్భంగా మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకోవడం గమనార్హం. కాగా ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ‘మే 10 నుంచి ట్రంప్ ఇలా చెప్పడం 18వ సారి’ అని అసహనం వ్యక్తం చేశారు.
ఇరాన్తో అణు చర్చలు జరిగే అవకాశం
అంతకుముందు నాటో సదస్సు సందర్భంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యు ద్ధం జరిగే అవకాశముందంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయె ల్తో తాను చర్చలు జరిపానని, ప్రస్తుతానికి ఆ రెండు దేశాలు బాగా అలిసిపోయాయన్నారు. అయితే మళ్లీ యుద్ధాన్ని ప్రారం భిస్తారా అంటే.. బహుశా ఏదో ఒకరోజు మ ళ్లీ యుద్ధం ప్రారంభం కావొచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక ఇరాన్తో వచ్చే అణు చర్చలు జరిగే అవకాశముందని పేర్కొన్నా రు. వచ్చే వారంలో టెహ్రాన్లో తమ ప్రతినిధులు ఇరాన్తో అణు చర్చలు జరిపే అవకా శముందన్నారు. అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్తో ఒప్పందం చేసుకునే అవకాశముందని తెలిపారు.
యుద్ధంలో ఇరాన్దే విజయం: ఖమేనీ
ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి స్పందించారు. 12 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇజ్రాయెల్పై తమ దేశమే విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా అమెరికాకు చెంపపెట్టు లాంటిదని తెలిపారు. ఇరాన్ ప్రభుత్వ టీవీ విడుదల చేసిన వీడియో సందేశంలో ఖమేనీ మాట్లాడుతూ.. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ విజయం సాధించింది.
ఇరాన్ విజయం అమెరికాకు చెంపపెట్టు లాంటిది. సోమవారం ఖతార్లోని అమెరికా కీలక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించాం. ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రాంతంలోని కీలకమైన అమెరికా కేంద్రాలను పట్టుకోగలదు.. అవసరమైతే దాడులు చేయగలదు.
భవిష్యతుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కావొచ్చు. ఏదైనా దురాక్రమణ జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.’ అని ఖమేనీ హెచ్చరించారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఖమేనీ ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారోనని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వ టీవీ ఖమేనీ వీడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం.
ఇరాన్ చమురుపై ఆంక్షలు సడలింపు!
ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను సడలించే అవకాశాలున్నట్టు ట్రంప్ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఇరాన్ పునర్ నిర్మాణానికి వారికి నగదు వనరులు కావాలని, ఆ దేశం కోలుకునేలా మద్దతు ఇవ్వడం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ తెలిపారు.