ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్
16-08-2024 06:53 PM
హైదరాబాద్: ఎస్ఎఫ్టీ ఎక్సైజ్ పోలీసులు ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.4.50 లక్షల విలువైన 30 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నింధితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.






