07-06-2025 08:30:07 AM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని(Ghatkesar Police Station) ఏదులాబాద్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు(IT employees) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్ పురికి చెందిన వర్షిత్ గా గుర్తించారు. మాధారంలో(Madharam) విందుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.