07-06-2025 02:05:30 AM
- ముక్కలు మూసుకొని వుంటున్న పేషెంట్లు
ఖమ్మం, జూన్ 6 (విజయ క్రాంతి):జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ అస్పత్రి లోని మెటర్నిటీ వార్డ్ పరిసరాల్లోని బాత్రూం లనుండి వచ్చే దుర్వాసనతో పేషెంట్ లు తీవ్ర ఇబ్బం ది పడుతున్నారు. వారు ముక్కులు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆపరే షన్ లు డిలీవరీ ఐన పేషెంట్ లు ఇన్ఫెక్షన్ ఐతదేమో అని ఆందోళన చెందుతూ తమ ఆవేదనను మీడియా కు వెళ్ళబుచ్చు కొంటున్నారు. పేషెంట్ ల ప్రక్కన వచ్చిన సహాయ కులు తీవ్ర ఇబ్బంది పడుతూ వార్డులో ఉం డలేక బయట చెట్ల క్రింద కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పేషెంట్లు కోరుతున్నారు.
రిపేర్లు చేపిస్తున్నాం : కిరణ్ కుమార్ సూపరిండెండెంట్
ఈ విషయంపై ఆసుపత్రి సూపరిండెండెంట్ ను వివరణ కోరగా, మెటర్నిటీ వార్డు సమీపంలోని బాత్రూం ల ల్లో కొంత ఇబ్బంది ఉందని మరమ్మత్తులు చేపిస్తున్నామని ఒక వారంలో సమస్య పరిష్కారం అయిద్ది అని సూపరిండెంట్ తెలిపారు.