calender_icon.png 23 October, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూటీని ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు స్పాట్ డెడ్

23-10-2025 09:35:53 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం(Chevella Mandal) మల్కాపూర్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన సల్మాన్, వడ్ల రవిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.