23-10-2025 09:35:53 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం(Chevella Mandal) మల్కాపూర్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యాలాల మండలం పగిడాల గ్రామానికి చెందిన సల్మాన్, వడ్ల రవిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.