ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద మరో రెండు మృతదేహాల గుర్తింపు
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్ బీసీ సొరంగం(SLBC tunnel accident) వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన విషాద ప్రమాదంలో ఎనిమిది మంది వ్యక్తులు చిక్కుకున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరింది. నిన్న మొదటి మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత, రెస్క్యూ బృందం నేడు మరో రెండు మృతదేహాలను గుర్తించింది. మొదటగా వెలికితీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ ది అని గుర్తించారు. గురుప్రీత్ సింగ్ అవశేషాలు కనుగొనబడిన ప్రదేశంలోనే తాజా రెండు మృతదేహాలు కనుగొనబడ్డాయి. వాటిని వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళ నుండి జాగిలాలను రప్పించిన తర్వాత సహాయక చర్యలలో పురోగతి వచ్చింది. కేరళ పోలీసు విభాగానికి చెందిన ఈ ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు భూగర్భంలో 15 అడుగుల వరకు ఖననం చేయబడిన మానవ అవశేషాలను గుర్తించడం వీటి ప్రత్యేకత.






