calender_icon.png 28 September, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్యూటీ తహసీల్దార్ గా ఇద్దరు ఎంపిక..

28-09-2025 10:26:29 PM

పాపన్నపేట (విజయక్రాంతి): ప్రభుత్వం వెలువరించిన గ్రూప్-2 ఫలితాల్లో పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి, అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుష్మిత డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. కొల్చారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలుగా సుష్మిత విధులు నిర్వర్తిస్తున్నారు. అర్జున్ రెడ్డి మెదక్ కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వారు వెల్లడించారు.