03-08-2025 08:50:31 PM
నల్గొండ క్రైమ్: కనగల్ మండలంలో బ్యాటరీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చండూరు సిఐ అది రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు. వీరి వద్దనుండి ఒక మోటార్ సైకిల్, 20 బ్యాటరీలు, 24 వేల నగదు దొంగతనానికి ఉపయోగించే ఒక బజాజ్ ఆటో, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం కనగల్ మండల పరిధిలో మోటర్ వాహనాల దొంగతనాలు, ట్రాక్టర్, ఆటో లలో బ్యాటరీలు దొంగతలనాకు పాల్పడుతున్నారనీ పిర్యాదులు రావడంతో కనగల్ ఎస్ఐ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నల్లగొండ నుండి దేవరకొండ వెళ్తున్న ఆటో మోటర్ సైకిల్స్ తనిఖీ చేయగా ఆటోలో 20 బ్యాటరీలు, మోటర్ సైకిల్స్ చోరీ చేసినట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొనీ విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. నల్గొండ పట్టణంలోని గొల్లగూడెం చెందిన సముద్రాల కృష్ణ, ఉస్మాన్ పురకు చెందిన టిప్పు సుల్తాన్ లు కలిసి చోరీలకు పాల్పడుతున్నట్టు వివరించారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ కె.రాజీవ్ రెడ్డి, ఎం.రవీందర్ రెడ్డి వెంకన్న, శేఖర్, సురేశ్, రమేశ్, వెంకట్ రెడ్డి లను సీఐ కె ఆది రెడ్డి అభినందించారు.