అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
14-03-2026 03:46 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బొల్లారం గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ.భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... లింగంపేట మండలం ఎక్కపల్లి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై భార్గవ్ గౌడ్ హెచ్చరించారు.అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీట్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.




