12 June, 2026 | 1:31 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

సొంత డబ్బుతో బోర్లు వేయించిన ఉజ్వల్ రెడ్డి

16-04-2025 01:27 AM

జహీరాబాద్, ఏప్రిల్ 15 : మండుటెండలకు తాగడానికి నీరు దొరకపోవడంతో జహీరాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సొంత డబ్బుతో బోర్ వేయించి దాహార్తిని తీర్చడానికి ముందుకు వచ్చారు.

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ లో ఒకటి, రాంనగర్ లో రెండు బోర్లు వేయించారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి సమస్యల ను పరిష్కరించడంలో ఉజ్వల్రెడ్డి ముందుంటున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. బోర్లు వేయించడం పట్ల కాలనీవాసులు హర్షంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.