10-08-2024 04:48:45 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఇటీవల ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) నుంచి యాజమాన్య వాటాను టేకోవర్ చేసిన అల్ట్రాటెక్ సిమెంట్ పబ్లిక్ షేర్హోల్డర్ల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకు జారీచేస్తున్న ఓపెన్ ఆఫర్ సెప్టెంబర్ 19న మొదలవుతుంది. అక్టోబర్ 3న ముగుస్తుందని అల్ట్రాటెక్ శుక్రవారం తెలిపింది. ఈ 26 శాతం వాటా కోసం రూ.3,142 కోట్లు ఖర్చుచేస్తుంది. షేరుకు రూ.390 చొప్పున పబ్లిక్ నుంచి 8.05 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్టు అల్ట్రాటెక్ ప్రకటించింది. ఇండియా సిమెంట్స్ షేరు ధర బీఎస్ఈలో రూ.367 వద్ద ముగిసింది.