22 May, 2026 | 9:30 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి

14-01-2026 09:06 PM

పండగపూట విషాదం నింపిన సంఘటన

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కుంటల–మాలపల్లి అందుగులగూడ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి ఒర్రె కింద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కౌటాల మండలానికి ముత్తంపేట్ గ్రామానికి చెందిన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, బెజ్జూర్ మండలంలోని దుబ్బగూడా గ్రామానికి చెందిన బోర్‌కుట్  శంకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన శంకర్‌ను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మామ సైతం మృతి చెందడంతో రెండు గ్రామాలలో విషాద ఛాయలు అల్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.