14-01-2026 09:02:34 PM
బీబీపేట,(విజయక్రాంతి): బీబీపేట మండలం యాడారం, శివార్ రాంరెడ్డిపల్లెలో కీర్తిశేషులు తోటపల్లి నర్సింగరావు వారి జ్ఞాపకార్థం సంక్రాంతి పండగ పురస్కరించుకొని బుధవారం క్రికెట్ టౌర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యాడారం గ్రామ సర్పంచ్ గొబ్బూరి సుధారాణి బాపురెడ్డి , తోటపల్లి సంతోష్ రావ్, బిజెపి మండల ఉపాధ్యక్షులు భరత్ రాజు బట్టు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ యువతను చెడు వ్యసనాలకు దూరం చేసి శారీరకంగా, మానసికంగా, చురుగ్గా ఉంచేందుకే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రికెట్ పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారుఈ కార్యక్రమంలో గ్రామ యువకులు , క్రీడ ఔత్సాహికులు పాల్గొన్నారు.