calender_icon.png 10 June, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊహించని విషాదం

10-01-2025 12:00:00 AM

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల  చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విషాదం చోటు చేసుకొంది. ముక్కోటి ఏకాదశి నాడు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసిన టోకెన్ల జారీకౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా 40 మందికి పైగా గాయపడ్డ ఘటన తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

మూడు రోజుల కోసం లక్షా 20 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి తిరుపతిలో 8 కేంద్రాలు, 90 కౌంటర్లను ఏర్పాటు చేశారు. గురు వారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ మొదలు కానుండగా బుధవారం ఉదయంనుంచే తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలనుంచి పెద్ద సంఖ్యలో జనం  తిరుపతికి చేరుకున్నారు. సాయంత్రానికి వీరి సంఖ్య లక్షల్లోకి చేరింది. బైరాగి పట్టెడ ప్రాంతంలోని  ఓ హై స్కూలు కేంద్రం వద్ద ఉన్న వేలాది భక్తులను దగ్గర్లోని పార్కుకు తరలించారు.

అయితే రాత్రి 8.15 గంటల ప్రాంతంలో పార్కులోని ఓ వ్యక్తి అస్వస్థతకు గురి కావడంతో అతనికి వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి ఊపిరాడక ఆరుగురు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అయిదుగురు మహిళలున్నారు. తొక్కిసలాట వార్త తెలియగానే ఎస్పీ, కలెక్టర్, టీటీడీ ఈవో ఘటనాస్థలికి చేరు కుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

సీఎం, మంత్రులు, అధికారుల పరామర్శలు, ఎక్స్‌గ్రేషియా ప్రకటన, ప్రతిపక్షాల విమర్శలు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. కానీ తొక్కిసలాట ఘటన ఎం దుకు జరిగింది? అధికారుల సమన్వయ లోపం, అలసత్వం కారణమా? లేక ఊహించని రీతిలో పెరిగి పోయిన భక్తుల తాకిడి ఫలిత మా?లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పడు ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించడం, ఒకరిద్దరు అధికారులను బాధ్యులుగా తేల్చి వారిపై చర్యలు తీసుకోవడం సర్వసాధారణమైంది. శాశ్వత పరిష్కార మార్గ్గాలు కనుగొన్న దాఖలాలు మాత్రం లేవు.

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విశేష పర్వదినాల్లో, మతగురువులు, బాబాలు నిర్వహించే సత్సంగ్‌లకు వేలసంఖ్యలో భక్తులు హాజరవడం మా మూలే. ఏర్పాట్లకు మించి జనం రావడంతో తొక్కిసలాట జరిగి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు.

‘భోలే బాబా’ గా ప్రసిద్ధి చెందిన స్థానిక బాబా ఒకరు ఏర్పాటు చేసిన సత్సంగ్‌కోసం 80 వేల మందికి అనుమతి తీసుకోగా రెండున్నర లక్షల మంది వచ్చారు.  బాబా పాదధూళికోసం పరుగులు తీసిన భక్తులు కిందపడిపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో దాదాపుగా అందరూ మహిళలు, చిన్నారులే ఉన్నారు. కుంభమేళా, శబరిమల సహా అనేక గుళ్లలో గతంలో జరి గిన తొక్కిసలాటల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

పరిమితికి మించి భక్తుల రద్దీకి తోడు, అధికారుల నిర్లక్ష్యమో లేక, భక్తుల తొం దరపాటు కారణంగానో చోటు చేసుకునే చిన్న తప్పిదాలకు భారీ ప్రాణనష్టం జరుగుతోంది.  ఇందులో ఏ ఒక్కరినీ బాధులను చేయడం భావ్యం కాదు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో జనాన్ని కంట్రోల్ చేయడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. సంక్రాంతినుంచి ప్రయాగ్ రాజ్‌లో మహా కుం భమేళా ప్రారంభం కానుంది.

నెలన్నర రోజుల పాటు జరిగే ఈ మేళా కు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా. ఇందుకోసం యూపీ ప్రభు త్వం విస్తృత ఏర్పాట్లు చేసింది కూడా. అయినా లక్షలాది భక్తులు గుమికూడే చోట ప్రమాదాలు చెప్పిరావు. తిరుపతి ఘటన తర్వాత అక్కడి అధి కారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘చేతులు కాలిన తర్వాత ఆకు లు పట్టుకున్నటు’్ల కాకుండా ముందుగా అప్రమత్తంగా ఉండడం మంచిది.