11-07-2025 05:49:33 PM
కరీంనగర్,(విజయక్రాంతి): బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఈద్గా వద్ద కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేటర్ నుండి కేంద్రమంత్రి స్థాయి వరకు బండి సంజయ్ కుమార్ అంచెలంచలుగా ఎదిగారని, ఆయన రాణించిన విధానం ప్రతి ఒక్కరికి మార్గ నిర్దేశనం లాంటిదన్నారు.క్రమశిక్షణ, పట్టుదలతో కరీంనగర్లో పార్టీ బలోపేతం కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొంది , నేడు కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్ పార్లమెంటు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.