calender_icon.png 12 July, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం

12-07-2025 12:00:00 AM

  1. కాంపొజిట్  స్టీల్ స్ట్రక్చర్స్ నిర్మాణాలకు ప్రోత్సాహం
  2. యువ సివిల్ ఇంజినీర్లు వినూత్నంగా ఆలోచించాలి 
  3. 2024-25లో నిర్మాణ రంగం వృద్ధి రేటు 11.97 శాతం
  4. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మా ర్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా రాష్ర్ట ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందని, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని సివిల్ ఇంజనీర్లను కోరారు.

మూడున్నరేళ్లలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలన్న దే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసొసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ (హైదరాబాద్) సెంటర్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘నెక్ట్స్ -జెన్ హైరైస్ బిల్డింగ్స్ (అడ్వాన్స్మెంట్స్ ఇన్ కాంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్)’ అనే అంశంపై నిర్వహించిన రెం డ్రోజుల జాతీయ సదస్సును మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి రేటును నమోదు చేసి, రాష్ర్ట ఆర్థిక వ్యవస్థకు రూ. 80,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిందన్నారు. రాష్ర్ట సేవల స్థూల విలువ జోడింపులో ఇది 24.9 శాతమని, ఈ గణాంకాలు తెలంగాణ నిర్మాణ రంగ ప్రగతికి నిదర్శనమని వివరించారు.

హైరైస్ భవన నిర్మాణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, హైదరాబాద్‌లో 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. మరో 250 భవనానాలు  వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ తరహా భారీ భవనాల నిర్మాణం లో ఆర్‌సీసీ నిర్మాణాలకు బదులుగా కాంపొజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్‌కుప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దీనివల్ల భవనం పూర్తయ్యేందుకు పట్టే సమ యం 40 శాతం, భారం 30 శాతం తగ్గి, భవనాలు భూకంపాలను సమర్థవంతంగా తట్టు కోగలవని పేర్కొన్నారు. పునర్వినియోగం వల్ల సర్క్యులర్ ఎకానమీ వృద్ధి చెందుతుందని చెప్పారు. భావితరాల కోసం కాంపోజిట్ స్టీల్ స్ట్రక్చర్స్ నిర్మాణాలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామని, ఇందుకు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చిన స్టీల్ వంతెన లు గొప్ప ఉదాహరణగా చెప్పారు. 

పర్యావరణ వారసత్వాన్ని రూపొందిస్తున్నం

 అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్(ఇండియా) వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ కాచర్ల మాట్లాడుతూ తాము భవనాలను నిర్మించడం మాత్రమే కాదని, రాబో యే తరాలకు పర్యావరణ అనుకూల వారసత్వాన్ని రూపొందిస్తున్నామన్నారు. పట్టణాభి వృద్ధిలో కీలకమైన స్థితిలో ఉన్నామని, పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న జీవనశైలికి అనుగుణంగా ఎత్తున భవనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. 

ఏసీసీఈ(ఐ) హైదరా బాద్ సెంటర్ పాలక మండలి సభ్యుడు కాశీరామ్ అడెపు మాట్లాడుతూ పట్టణ ప్రాంతా లు, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నిర్మాణాల అభివృద్ధి వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం ఒక ఉత్ప్రేరకంగా నిలవటంతో పాటుగా, ఇంజనీర్లు, విధాన రూపకర్తలు సురక్షితమైన, మరింత స్థిరమైన నిర్మాణ పద్ధతులను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందన్నారు.

స్మార్ట్ మౌలిక సదుపాయా లు, పట్టణ స్థిరత్వంపై చర్చలు రేపటి స్కులైైన్లను రూపొం దించడం లో కీలకంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఏసీసీఈ(ఐ) హైదరాబాద్ సెంటర్ వైస్-చైర్మన్, ఇన్-ఛార్జ్ చైర్మన్ భీమ్ రావు జలిగామ మాట్లాడుతూ ఈ సమావేశం తెలివైన, మరింత స్థిరమైన పట్టణ అభివృద్ధి వైపు ఒక శక్తివంతమైన ముందడుగును సూచిస్తుందన్నారు.

ఇంజినీర్లు బాధ్యతతో ఆవిష్కరణలు చేయాలని, స్థిరత్వంతో నిర్మించాలని, పర్యావరణ అనుకూలమైన నగరా లను రూపొందించాలని కోరుతుందన్నారు. ఏసీసీఈ(ఐ) కార్యదర్శి సీ.రమేష్ మాట్లాడుతూ ఈ వేదిక ఇంజినీరింగ్ సమాజంలో సహకారం, జ్ఞాన భాగ స్వామ్యాన్ని పెంపొందిస్తుందన్నారు.

పర్యావరణ అనుకూల అభివృద్ధి ప్రాముఖ్యతను, హైరైజ్ నిర్మాణంలో తాజా పరిశోధనలను బలోపేతం చేస్తూ ఆవిష్కరణలను నడిపిస్తుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ ప్రతినిధులు ఎస్ జీఎస్ మూర్తి, మహేందర్ రెడ్డి, శేషాద్రి, కాశీరాం, నర్మదా, రమేశ్, భీం రావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయిలో ఒకే కోడ్

నిర్మాణ రంగంలో ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం, బిల్డ్ నౌ పోర్టల్ ద్వారా నిర్మాణ అనుమతుల్లో వేగం, జవాబుదారీతనం, విశ్వాసాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పే ర్కొన్నారు. కాంపోజిట్ స్టీల్ హై-రైజ్ డిజైన్‌పై జాతీయస్థాయిలో ఒకే రకమైన మార్గదర్శకాలు(కోడ్) తెచ్చేలా కేంద్రం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్)తో కలిసి పని చేస్తామన్నారు.

కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుందని యువ సివిల్ ఇంజినీర్లకు సూచించారు. స్మార్ట్ నగరాలు, స్థిరమైన గృ హనిర్మాణం, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తామన్నారు.