calender_icon.png 25 June, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమర్జెన్సీ పాలన చీకటి ఆధ్యాయం.. మాయని మచ్చ

25-06-2025 10:18:41 AM

  1. ఎమర్జెన్సీ పాలన చీకటి ఆధ్యాయం
  2. చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు
  3. ఎమర్జెన్సీ పాలన దేశానికి మాయని మచ్చ
  4. కాంగ్రెస్ అధికార దాహానికి ఎమర్జెన్సీ పాలన నిదర్శనం

హైదరాబాద్: ఎమర్జెన్సీ పాలన చీకటి ఆధ్యాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) అన్నారు. చీకటి ఆధ్యాయానికి 50 ఏళ్లు అని బండి సంజయ్(Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. ఎమర్జెన్సీ పాలన(Emergency rule) దేశానికి మాయని మచ్చ అన్నారు. ప్రజల గొంతు నొక్కి కాంగ్రెస్ చేసిన అరాచకాలకు ఎమర్జెన్సీ పాలన నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్(Congress) అధికార దాహానికి ఎమర్జెన్సీ పాలన నిదర్శనమని  బండి సంజయ్ విమర్శించారు.

''ప్రజాస్వామ్యానికి పాతరేసి, నియంతృత్వం రాజ్యమేలిన రోజు, దేశమంతా అధికార దాహమనే చీకటితో నిండిన రోజు, స్వాతంత్ర్యాన్ని కాలరాసి, రాక్షసత్వం రాజ్యమేలిన రోజు, వ్యక్తి స్వేచ్ఛకు సమాధి కట్టి రాజ్యాంగాన్ని పరిహసించిన రోజు, కాంగ్రెస్ పార్టీ విధించిన “ఎమర్జెన్సీ”, భారత దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిల్చిన దుర్దినం ఈ రోజు.... ఎమర్జెన్సీనీ ఎత్తివేయుటకు పాటుపడి, రాజ్యాంగ విలువలను కాపాడుటకు, జైళ్లలో మగ్గిన ఎందరో మహనీయుల సేవలను స్మరించుకుంంటూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడదాం.'' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో పోస్టు చేశారు.